అలాగే మన్యం, కోనసీమ, ఉభయగోదావరి,ఏలూరు,కృష్ణా, ఎన్టీఆర్,గుంటూరు,బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.(2/2)
నైరుతిరుతుపవనాలు ఒడిశా,కోస్తాంధ్ర & వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు మరింత ముందుకు వెళ్లేందుకు రానున్న3-4రోజులు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.తెలంగాణ నుండి బంగాళాఖాతం మధ్య ప్రాంతాల వరకు ద్రోణి కొనసాగుతుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు నేడు రాజధాని అమరావతిలోని సచివాలయంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు తన మంత్రివర్గ సహచరులకు శాఖలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సమున్నత లక్ష్యాల సాధన దిశగా మరొక అడుగు ముందుకు వేశారు. మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు ఇవి:
#APSDMA కార్యాలయాన్ని ప్రొబేషనర్ IPS అధికారులు నవజ్యోతి మిశ్రా,మండా జావలి,మనోజ్ రామ్నాథ్,పాటిల్ దేవరాజ,రోహిత్ కుమార్ చౌదరి సందర్శించారు. #APSDMA అవలంబిస్తున్న అనేక సాంకేతికతల గురించి ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.విపత్తుల సమయంలోఅలర్ట్స్ పంపే విధానాన్ని ప్రత్యక్షంగా చూపించారు.
రాష్ట్రములో రబీ కరువు పరిస్థితిని పరిశీలించి,అంచనా వేయడానికి రితేష్ చౌహాన్ నేతృత్వంలోని కేంద్ర బృందం కరువు ప్రభావిత జిల్లాల్లో మంగళవారం నుంచి శుక్రవారం వరకు పర్యటించనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
#Drought #Andhrapradesh #APSDMA
రేపు పార్వతీపురంమన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, అల్లూరి సీతారామ రాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు,